ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి మండలంలో అక్రమంగా మొరం తరలిస్తున్న గండిమాసాని పేట్ గ్రామానికి చెందిన సతీష్ కు చెందిన జేసీబీ, ట్రాక్టర్ మంగళవారం పట్టుకున్నట్లు ఎల్లారెడ్డి తహసీల్దార్ మహేంధర్ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసి జేసీబీ, ట్రాక్టర్ పట్టకున్నట్లు తెలిపారు. వీటిని ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా మొరం తరలిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

