- నూతన సంవత్సరం వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలి
- రుద్రూర్ ఎస్.ఐ సాయన్న
రుద్రూర్, బతుకమ్మ : నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని రుద్రూర్ ఎస్.ఐ సాయన్న మండల ప్రజలను కోరారు. ఇతరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిర్వహించుకోవాలని విజ్ఞప్తి చేశారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ర్యాష్ బైక్ డ్రైవింగ్, త్రిబుల్ రైడింగ్ చేయడం, ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించడం, రాకపోకలకు అంతరాయం కలిగించడం, డీజే స్పీకర్లు పెట్టి ప్రజలను ఇబ్బంది పెట్టడం, రోడ్లపై మద్యం సేవిస్తూ తిరగడం, మాదక ద్రవ్యాలు (డ్రగ్స్). గంజాయి సేవించడం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అదేవిధంగా రుద్రూర్ మండల ప్రజలకు ఎస్.ఐ సాయన్న ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
