23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

నిజాంసాగర్ ప్రాజెక్టులోకి స్వల్ప వరద

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, నిజాంసాగర్: నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వర ప్రధాయని నిజాం సాగర్ కు స్వల్ప వరధవస్తుంది. అదివారం ఉదయం 863 క్యూసెక్కుల వరధ వచ్చింది. మద్యహ్నం తరువాత కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టులోనికి ఎగువ భాగంలో కురుస్తున్న వర్షాలకు స్వల్పంగా 750 క్యూసెక్కుల వరద నీరు ఇన్ఫ్లోగా వచ్చి చేరుతున్నట్లు నీటి పారుదుల శాఖ ఏఈ శివప్రసాద్ తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1405.00 అడుగులు (17.802 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1390.33 అడుగుల (4.176 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. నిజాం సాగర్ ఎగువ భాగంలోని సింగూర్ డ్యాంలో ప్రస్తుతం 29.917 టియంసీలకు గాను 14.891 టియంసీల నీరు నిల్వ ఉంది. సింగూర్ నిండక పోవడంతో అ ప్రాజెక్టు నుంచి నీటి విడుధల జరుగకపోవడంతో నిజాం సాగర్ కు వరధ రావడం లేదు. ప్రాజెక్టు ఎగువ భాగంలో కురిసిన వర్షపు నీరు మాత్రమే వచ్చి చేరుతుంది.

More articles

Latest article