నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: అతిగా మద్యం సేవించి వాహనాలను నడిపిన 12 మందికి కౌన్సిలింగ్ నిర్వహించి సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జాహాన్ ముందు హాజరు పరిచినట్లు ట్రాఫిక్ ఎస్ఎచ్ఓ ప్రసాద్ తెలిపారు. వీరిలో 11 మందికి రూ.15,500 జరిమానా విధించారని తెలిపారు. చంద్రశేఖర్ కాలనీకి చెందిన షేక్ అబ్బాస్ కు మూడు రోజుల జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.
