28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

రెండు రోజులు జైలు శిక్ష

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మెండోరా: ప్రజల రక్షణ కోసం ఆపదలో ఉన్న వారిని ప్రథమ చికిత్స అందించి హాస్పిటల్ చేర్చడం కోసం విధులు నిర్వహిస్తున్న 100 పోలీసులకు, 108 సిబ్బందికి విధులకు ఆటంకపరచినందున కుంట భోజన అనే వ్యక్తికి రెండు రోజులు జైలు శిక్ష విధించడం జరిగిందని మెండోరా ఎస్సై నారాయణ ఒక ప్రకటనలు తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం భోజన్న (38) అనే వ్యక్తి దుదిగాం గ్రామానికి చెందిన వ్యక్తి త్రాగిన మత్తులో గురువారం నాడు అర్ధరాత్రి 12:30 గంటల నుండి వరుసగా 14 సార్లు డయల్ 100 చేసి పోలీసుల విధులకు ఆటంకపరిచినాడని,అలాగే 108 కి కూడా కాల్ చేసి ఆక్సిడెంట్ అయిందంటూ వాళ్లు విధులకు కూడా ఆటంకపరచడంతో గురువారం ఆర్మూర్ కోర్టు ముందు భోజనం ను హాజరు పరచగా కోర్టు రెండు రోజుల జైలు శిక్ష విధించడమైనదని ఎస్సై తెలియజేశారు.

More articles

Latest article