సిరిసిల్ల, బతుకమ్మ: అప్పుల బాధ తాళలేక మరో నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఏడాదిగా ఉపాధి లేక అప్పులు తీర్చే మార్గం కనిపించక సిరిసిల్లకు చెందిన దూస గణేశ్ బలన్మరణానికి పాల్పడ్డాడు. తనకున్న అప్పులను లేఖలో ప్రస్తావించిన గణేశ్.. బజాజ్ ఫైనాన్స్ వాళ్ల వేధింపులు ఎక్కువయ్యాయని పేర్కొన్నాడు. గణేశ్ కు ఇద్దరు కూతుళ్లు, భార్య ఉన్నారు.

