నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: ఫిట్ నెస్ క్లబ్ ఆఫ్ మోపాల్, నిజామాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మోపాల్ లో బ్యాడ్మింటన్ టోర్నీని ఆదివారం నిర్వహించారు. సౌరబ్ షాదుల్లా, అరవింద్, విజయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన టోర్నీకి ప్రముఖ పిల్లల వైద్యుడు జి హరికృష్ణ కో స్పాన్సరర్ గా తన వంతు సహకారం అందించారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులు, సీనియర్ బ్యాడ్మింటన్ ప్లేయర్లు మల్లన్న, ప్రతాప్ నాయక్, శ్రీనివాస్, గంగాధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

