27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

విధులు బహిష్కరించిన న్యాయవాదులు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ నిజామాబాద్ సిటీ : బంగ్లాదేశ్లో మైనార్టీ హిందూ పై జరుగుతున్న హత్యలను ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆఫ్ ఫెడరేషన్ బార్ అసోసియేషన్ పిలుపు మేరకు బుధవారం నిజామాబాద్ బార్ అసోసియేషనన్ అధ్యక్షులు జగన్మోహన్ గౌడ్ అధ్యక్షతన అత్యవసర సమావేశమై బంగ్లాదేశ్ లో మైనార్టీ హిందువులపై హత్య దాడులను ఖండిస్తూ ఏకగ్రీవంగా తీర్మానించారు. అనంతరం జిల్లా కోర్ట్ ప్రధాన గేటు ఎదుట నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ బంగ్లాదేశ్లో మైనార్టీ హిందువుల పై హత్యలు, దాడులు ఆస్తులు ధ్వంసం చేయడాన్ని బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తుందని అరాచకాలపై అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు, రాజకీయ పార్టీలు స్పందించకపోవడం శోచనీయమన్నారు. నిరాశ్రయులైన హిందువులకు భారత ప్రభుత్వం ఆశ్రయం కల్పించి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బార్ కౌన్సిల్ సభ్యుడు ఎం రాజేందర్ రెడ్డి అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వసంత్ రావు సంయుక్త కార్యదర్శి దంపల్ సురేష్ లైబ్రరీ కార్యదర్శి పిల్లి శ్రీకాంత్ న్యాయవాదులు పడిగల వెంకటేశ్వర్ యెర్రం విఘ్నేష్ తుల గంగాధర్ మానిక్ రాజ్ బిట్ట్ల రవి విశ్వక్ సేవ్ మధు అరెటి నారాయణ దేవదాస్ పుణ్యారాజ్ బాలాజీ ఆశ నారాయణ రావిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article