25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

రోజురోజుకు ఉదృతం అవుతున్న జూడాల ఆందోళన

Must read

📰 Generate e-Paper Clip

  • సిబిఐ నిష్పక్షపాతంగా విచారణ జరపాలి

బతుకమ్మ నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కోల్కతాలోని ఆర్ కర్ మెడికల్ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థిని మోవ్మిద పై ఇటీవల జరిగిన అత్యాచారం, హత్యకు నిరసనగా జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆద్వర్యంలో బుదవారం ఆందోళన చేశారు. ఈమేరకు నిజామాబాద్ జిల్లా జూడ అధ్యక్షుడు జితిన్ మాట్లాడుతూ..కోల్కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజీ క్యాంపస్లో రెండవ సంవత్సరం పిజి విద్యార్థిని దారుణంగా చంపడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్టును అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఈ కేసును సిబిఐకి అప్పగించడం హర్షనీయమని సిబిఐ నిష్పక్షిపాతంగా విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర జూనియర్ డాక్టర్ల వైద్య సంఘం అడ్వైజర్ ప్రణయ్, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ రమ్య, మహిళా జూనియర్ డాక్టర్లు గ్రీష్మ తదితరులు పాల్గొన్నారు.

Juda's concern is increasing day by day

More articles

Latest article