24 C
Hyderabad
Sunday, August 2, 2026

జంగంపల్లి లో అఖిలభారత సహకార వారోత్సవాలు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని జంగంపల్లి సొసైటీ లో డీసీసీబీ డైరెక్టర్ సిద్ధ రాములు అధ్యక్షతన 71వ అఖిలభారత సహకార వారోత్సవాలు కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి తెలంగాణ కో-ఆపరేటివ్ యూనియన్ హైదరాబాద్ ప్రిన్సిపల్ డాక్టర్ భూక్య వెంకన్న పాల్గొని రైతులను ఉద్దేశించి మాట్లాడారు. వికసిత భారత్ నిర్మాణంలో సహకార సంఘాల పాత్ర అంశంపై వివరించారు. సహకార సంఘాల సభ్యులు సురక్షిత పంటల సాగు కొరకు ప్రయత్నం చేయాలని,వ్యవసాయ శాఖ అధికారులతో అవగాహన సదస్సులు నిర్వహిస్తూ పంటల దిగుబడి, మార్కెటింగ్ పంటల ప్రోత్సాహం,భూసార పరీక్షలు మొదలగు వాటిని చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ ఆఫీసర్ సవిత, డైరెక్టర్లు,సీఈఓ రమేష్, రైతులు పాల్గొన్నారు.

More articles

Latest article