27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

విజయ డైరీ ఉత్పత్తులను వినియోగించండి

Must read

📰 Generate e-Paper Clip

. . . హోటల్ యజమానులకు మాజీ మంత్రి విన్నపం

 నిజామాబాద్, బతుకమ్మ:

నిజామాబాద్ అర్బన్ హోటల్ యజమానులతో మాజీ మంత్రి సుధర్శన్ రెడ్డి సమావేశం అయ్యారు. నగరంలోని అర్ అండ్ బి గేస్ట్ హౌజ్ లో శుక్రవారం ఉదయం హోటల్ యాజమానులతో ఎమ్మెల్యే సుధర్శన్ రెడ్డి సమావేశమై విజయ డైరీ పాలును  వాడాలని కోరటం జరిగింది.  విజయ డైరీ ప్రభుత్వం సంస్థ అని రైతులను ప్రోత్సహించుటకు ప్రజలకు నాణ్యమైన పాల ఉత్పత్తులకు మంచి పేరుగడించిందని తెలిపారు. హోటల్ యజమాన్యాలకు అవసరమైన ఉత్పత్తులను అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ , ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ , రాష్ట్ర కోపరేటివ్ సొసైటీ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి , నుడా చైర్మన్ కేశవ వేణు , నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి , నరాల రత్నాకర్ , నరేష్ రెడ్డి  లు కార్యక్రమంలో పాల్గొన్నారు

More articles

Latest article