ఎల్లారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలో ఉన్న పెద్ద చెరువులో జిల్లా మత్స్యసహకార అధికారి శ్రీపతి చేప పిల్లలను విడుదల చేశారు. రాహు, మీరుగు, కట్ల రకాల చేప పిల్లలను సబ్సిడీపై పంపిణీ చేశారు. ఆర్డీవో మన్యం ప్రభాకర్, ఎంపీడీవో ప్రకాశ్, మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజ్, కాంగ్రెస్ అధ్యక్షుడు కురుమ సాయిబాబా, కౌన్సిలర్లు, మత్స్యశాఖ అధికారులు ఎఫ్ ఏలు శ్వేత, సురేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
