26.2 C
Hyderabad
Monday, August 3, 2026

విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

ధర్పల్లి, బతుకమ్మ: దాతల సహకారంతో దుబ్బాక జిల్లా ఉన్నత పాఠశాల నందు చదువుతున్న వందమంది విద్యార్థులకు శనివారం క్రీడ దుస్తులు పంపిణీ చేశారు.  ఈ క్రీడా దుస్తులు పంపిణీ కార్యక్రమంలో 30 మంది విద్యార్థులకు దాతలు యం.అశ్విన్, పాఠశాల పూర్వ ఉపాధ్యాయులు గంగా సావిత్రి,బాబు కృష్ణ, సాయికిరణ్,శ్రీనివాస్ రెడ్డి, నాగుల కళ్యాణి,మల్లికార్జున్ కలిసి 30 క్రీడా దుస్తులు అలాగే మరిపెద్ది సుపరాజ్ 10 దుస్తులు, కానిస్టేబుల్ విజయలక్ష్మి 10, హరీష్ 10, 2013-2014 బ్యాచ్ పూర్వ విద్యార్థులు నుండి 10 క్రీడా దుస్తులను విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి రమేష్, పి ఆర్ టి యు అధ్యక్షుడు కే. వెంకట్ రాజారెడ్డి, ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు సైరా సత్యం, ఉపాధ్యాయులు మరియు వీడీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article