27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు షూ పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ భిక్కనూరు: మండలంలోని తిప్పాపూర్ గ్రామంలో ఉన్న 3 ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భీమ్ రెడ్డి తన సొంత డబ్బులతో 150 మంది విద్యార్థులకు 45వేల రూపాయల ఖర్చుచేసి షూ, సాక్స్ పంపిణీ చేశారు. ప్రవేటు పాఠశాలకు దీటుగా విద్యార్థులు చదువులో పోటీపడాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు ధర్మయ్య, విడిసి అధ్యక్షులు సిద్ధరాములు, ఆలయ చైర్మన్ భూమయ్య, నాయకులు లింగారెడ్డి, మహేష్, కిషన్, నర్సారెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, నాయకులు, గ్రామస్తులు, విద్యార్థులు, తదితరులు ఉన్నారు.

Shoe distribution to government school students

More articles

Latest article