హైదరాబాద్, బతుకమ్మ : రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం స్థానిక సంస్థల ఎన్నికల మొదటి విడత నోటిఫికేషన్ విడుదల చేసింది. బీసీ రిజర్వేషన్ల అంశం హైకోర్టులో విచారణ జరుగుతుండగానే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్ ప్రక్రియ మొదలైంది. 53 రెవెన్యూ డివిజన్లో తొలివిడత 292 జెడ్పీటీసీ, 2963 ఎంపీటీసీ పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లో ఎంపీటీసీలకు మండల కార్యాలయాల్లో..జెడ్పీటీసీలకు జిల్లా పరిషత్ ఆఫీసుల్లో నామినేషన్లు స్వీకరించనున్నారు. ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి అన్ని జిల్లాల్లో అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు కూడా ఈరోజే సాయంత్రం లోగా వెల్లడించనుంది. నిన్నటి విచారణలో నోటిఫికేషన్పై స్టే ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. దీంతో ఈసారి స్థానిక ఎలక్షన్లు ఆసక్తికరంగా మారాయి.