Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 December 2024, 4:35 pm Posted by : ramakrishna

యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడికి సన్మానం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన విపుల్ గౌడ్ ను జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్ అటెండర్ ఖాజా శుక్రవారం పార్టీ కార్యాలయంలో సన్మానించారు. షేక్ ఖాజా గత 49 సంవత్సరాలుగా కాంగ్రెస్ భవన్ అటెండర్ గా పనిచేస్తున్నారు. 1975 నుంచి ఖాజా కాంగ్రెస్ భవన్ అటెండర్ గా పనిచేస్తున్నారని, అయన సేవలు అభినందనీయమని విపుల్ గౌడ్ అన్నారు . విపుల్ గౌడ్ ఖాజా కు కృతఙ్ఞతలు తెలిపారు .