Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 December 2024, 6:28 pm Posted by : ramakrishna

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి యువత కృషి చేయాలి

బతుకమ్మ దుబ్బాక ప్రతినిధి : దౌల్తాబాద్ మండల కేంద్రంలో దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డిని సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ కొంగరి అమరేందర్ రెడ్డి,దుబ్బాక నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బురాని శ్రీకాంత్ కరాటే మాస్టర్,దుబ్బాక మున్సిపల్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కడవెర్గు గోపి, డాకూరి శ్రీకాంత్ రెడ్డి లు మర్యాదపూర్వకంగా కలిశారు.గెలుపుకు కారణం అయినా కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డిని సన్మానం చేశారు.అనంతరం సందర్బంగా ఇటీవల జరిగిన యూత్ కాంగ్రెస్ పోటీలో గెలుపొందిన యువ నాయకులను సన్మానం చేసి అభినందించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ యూత్ నాయకులకు అన్ని విధాలుగా అండగా ఉంటాను. త్వరలో జరిగే స్థానిక ఎన్నికలలో గ్రామాల్లో కీలక పాత్ర మిరే వహించి కాంగ్రెస్ పార్టీని బలోపేతంకు కృషి చేయాలన్నారు.రాజకీయాల్లోకి యువత రావాలని అన్నారు.