Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 July 2025, 4:23 pm Posted by : ramakrishna

యువత సన్మార్గంలో నడవాలి

  • ప్రిన్సిపల్ జైపాల్ రెడ్డి

 

భీంగల్, బతుకమ్మ : సమాజంలో యువత డ్రగ్స్, గంజాయి లాంటి మాధక ద్రావ్యలకు అలవాటుపడి వారి జీవితాలను నాశనం చేసుకొంటున్నారని, యువత చెడు మార్గంలో పోకుండా సన్మార్గంలో నడవాలని భీమ్ గల్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ జైపాల్ రెడ్డి అన్నారు. శనివారం గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో మాధక ద్రావ్యాల నివారణ పై సదస్సును నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఈ అలవాటు కారణంగా తమ ఆరోగ్యాలను పాడుజేసుకొంటున్నారని అన్నారు. ఈ సందర్బంగా స్టూడెంట్స్ కౌన్సిలర్లు మండళోజి నర్సింహాస్వామి, శ్రీనివాస్ గౌడ్ లు విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమం లో కాలేజ్ లెక్చరర్లు, కార్యాలయ నిర్వహణ సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.