- రుద్రూర్ ఎస్సై సాయన్న
రుద్రూర్, బతుకమ్మ: గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని, వాటి భారీన పడి భావి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని రుద్రూర్ ఎస్సై సాయన్న విద్యార్థులకు సూచించారు. రుద్రూర్ మండల కేంద్రంలోని ఆహార సాంకేతిక కళాశాల విద్యార్థులకు రుద్రూర్ ఎస్సై సాయన్న మంగళవారం గంజాయి, మాదక ద్రవ్యాల నిర్ములన కై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్సై సాయన్న మాట్లాడుతూ.. యువత గంజాయి, మత్తు పదార్థాల వంటి చెడు వ్యాసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, పోలీసు సిబ్బంది, విద్యార్ధిని, విద్యార్థులు పాల్గొన్నారు.