బోధన్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని పెగడపల్లి గ్రామానికి చెందిన బుడ్డోల్ల గంగ శేఖర్(27) మృతి చెందాడు. వృత్తి నిమిత్తం తన పని ముగించుకుని సాటాపూర్ గేట్ నుండి రెంజల్ వైపు వెళ్తుండగా మార్గమధ్యంలో అడవి పంది గుద్దడంతో ఘటన స్థలంలోనే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.