Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 March 2025, 6:34 pm Posted by : ramakrishna

ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య

బతుకమ్మ భిక్కనూరు:  ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని జంగంపల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు,  కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన శ్రావణ్ (23) కల్లు దుకాణంలో కూలి పని చేస్తూ జీవిస్తున్నాడు. మతిస్థిమితం లేని కారణంగా మద్యానికి బానిసై ఆత్మహత్య చేసుకుందామని చాలాసార్లు ప్రయత్నించారు.  కుటుంబీకులు తెల్లవారుజామున ఇంటి ముందు ఉన్న కొట్టంలో చూసేసరికి శ్రావణ్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించి మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.