భీమ్ గల్, బతుకమ్మ : భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ గా భీమ్ గల్ పట్టణానికి చెందిన యోగేశ్వర నర్సయ్య నియమితులయ్యారు. గత 12 సంవత్సరాలుగా బీజేపీ లో కార్యకర్త స్థాయి నుండి పని చేసిన నర్సయ్య, బీజేపీ లో బూత్ ప్రెసిడెంట్ గా , శక్తి కేంద్ర ఇంచార్జ్ గా, భీమ్ గల్ టౌన్ పార్టీ ప్రెసిడెంట్ గా పనిచేశారు. ఆయన పార్టీకి చేస్తున్న సేవలను గుర్తించి స్టేట్ కౌన్సిల్ మెంబర్ గా ఆయన్ని నియమించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి తనకు ఉన్నత భాద్యతను అప్పగించిన,తన నియమాకానికి కృషి చేసి ఎం. పీ ధర్మపురి అరవింద్, కానిస్టెన్సీ ఇంచార్జ్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.