Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 June 2025, 3:40 pm Posted by : ramakrishna

కామారెడ్డిలో ‘యోగా వాక్’

కామారెడ్డి, బతుకమ్మ : 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ దశాబ్ది వేడుకల సందర్భంగా కామారెడ్డి పట్టణంలో మంగళవారం “యోగ వాక్” నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో, పతంజలి యోగ సంస్థ సహకారంతో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల్లో యోగ జాగ్రత్తలు, ఆరోగ్య ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్డీఓ వీణ జెండా ఊపి యోగా వాక్‌కు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ – “యోగ ద్వారా మానసిక, శారీరక దృఢత్వం పెరుగుతుందని అన్నారు. ప్రతిరోజూ జీవన శైలిలో యోగాను భాగంగా చేసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చని తెలిపారు. రాబోయే కాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండి, రోగనిరోధక శక్తిని పెంచుకోవాలన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న మాటలో ఎంతో ఆంతర్యం ఉందని, అందులో యోగకు ముఖ్యమైన స్థానం ఉంది” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ ఆకుల శ్రీకాంత్, వైద్యాధికారులు డా. వెంకటేశ్వర్లు, డా. దేవయ్య, డా. నీలిమా, డా. విజయ, డా. విజయలక్ష్మి, డా. చైతన్య, డా. నహీద, ఇతర వైద్య సిబ్బంది గోపాల్, శ్రీనివాస్, మహమ్మద్ బైగు, యోగా శిక్షకులు, పతంజలి కుటుంబ సభ్యులు మరియు ఆయుష్ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.

'Yoga Walk' in Kamareddy