Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 August 2024, 9:16 pm Posted by : ramakrishna

యోగా అసోసియేషన్ నిజామాబాద్ ఆధ్వర్యంలో యోగా ఆసనాల పోటీలు

బతుకమ్మ నిజామాబాద్ సిటీ : ప్రతి మనిషికి యోగ ఎంతో ముఖ్యమని, సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని యోగ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షురాలు ఐశ్వర్య కాలే పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి యోగా ఆవశ్యకత గురించి తెలపటానికి గురువారం కిసాన్ గంజిలోని ఉమామహేశ్వరి ఫంక్షన్ హాల్లో 13వ జిల్లా స్థాయి యోగ పోటీలను నిర్వహించినట్లు ఆమె తెలిపారు. ఈ పోటీలో సుమారు 400 మంది వరకుపాల్గొన్నట్లు ఆమె వివరించారు.18 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల వయసు గలవారు ఈ పోటీలో ఆసక్తిగా పాల్గొనడం జరిగిందని ఆమె అన్నారు. ఈ యోగాసన పోటీలకు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల నుంచి రావడం జరిగిందన్నారు. ఈ జిల్లాస్థాయి యోగాసన పోటీలో 50 మంది ఎంపిక అవడం జరిగిందన్నారు. యోగాసన పోటీలో గెలుపొందిన వారికి ఈ నెల 31న రంగారెడ్డి జిల్లాలో రాష్ట్రస్థాయి లో జరిగే కాంపిటేషన్కు పంపించడం జరుగుతుందని ఆమె వివరించారు. కార్యక్రమంలో సెక్రెటరీ గంగాధర్, యోగ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Yoga Asana Competitions under the auspices of Yoga Association Nizamabad