Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 September 2026, 6:14 pm Posted by : ramakrishna

యెండల సువర్చలకు ఓయూ నుండి డాక్టరేట్ ప్రధానం

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

తెలంగాణ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ (సీ)గా విధులు నిర్వహిస్తున్న యెoడల సువర్చలప్రదీప్ కు మంగళవారం ఓయూ 85వ  స్నాతకోత్సవంలో ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ డాక్టరేట్ ప్రధానం చేసారు. సువర్చల “ఎడ్యుకేషన్ అమాంగ్ రూరల్ డిసడ్వాంటేజ్ క్లాస్ గర్ల్స్  ఏ స్టడీ ఆన్ స్కూల్ అడ్జస్ట్మెంట్ అండ్ ఎకనామిక్ పెర్ఫార్మన్స్” అనే అంశంపై ఉస్మానియా యూనివర్సిటీ ఆంగ్ల విభాగ ప్రొఫెసర్ టి.విజయ్ కుమార్ పర్యవేక్షణలో పరిశోధన పూర్తి చేశారు.  ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన 85 వ కాన్వకేషన్ ఉత్సవానికి గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్ల  ముఖ్య అతిథిగా హాజరైనారు. ఈ సందర్బంగా సువర్చల మాట్లాడుతూ తన కుటుంబం అందించిన సహకారంతో ఈ డిగ్రీ పూర్తి చేశానని ఆమె తెలిపారు. సువర్చలను యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ బోధన,  బోధనేతర సిబ్బంది, విద్యార్థులు ఆమెను అభినందించారు.