Batukammanews
Newspaper Banner
Date of Publish : 31 May 2025, 2:13 pm Posted by : ramakrishna

ఏసీబీకి చిక్కిన ఎల్లారెడ్డిపేట సర్వేయర్

రాజన్న సిరిసిల్లా, బతుకమ్మ : లంచం తీసుకుంటూ ఓ సర్వేయర్ ఏసీబీకి చిక్కాడు. ఈఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలంలో శనివారం చోటు చేసుకుంది. ఎల్లారెడ్డిపేట ఎమ్మార్వో కార్యాలయంలో  సర్వేయర్ గా  నాగరాజు విధులు నిర్వహిస్తున్నాడు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన జక్కాపురం మల్లేశం అనే రైతు భూమి కొలతల పంచనామ ధ్రువీకరణ పత్రం జారీ కోసం రూ.లక్ష డిమాండ్ చేశాడు. మల్లేశం గతంలో రూ. 22 వేలు నాగరాజుకు ఇచ్చాడు. శనివారం చంద్రంపేట రైతు వేదిక వద్ద మరోసారి రూ. 15,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. నాగరాజును అధికారులు ఎల్లారెడ్డిపేట ఎమ్మార్వో కార్యాలయానికి తరలించి విచారణ జరుపుతున్నారు.