ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాలేము
వెబ్ న్యూస్, బతుకమ్మ : ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకూడదని వైసీపీ సంచలన నిర్ణయం తీసుకొంది. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి లేదని విమర్శించారు. అసెంబ్లీకి వెళ్లినా వెళ్లకపోయినా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని వెల్లడించారు. కాగా, సోమవారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.