యాదగిరిగుట్ట, బతుకమ్మ : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. 3వ రోజు సోమవారం స్వామి వారు మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి శేష వాహన సేవలో తిరుమాఢ వీధుల్లో ఊరేగారు. సాయంత్రం నిత్యహోమం, చతు స్థానార్చనలు నిర్వహించారు. లక్ష్మీనారసింహుడు ప్రీతిపాత్రమైన శేష వాహనుడిపై తిరు మాఢ వీధుల్లో ఊరేగారు. ఈవాహన సేవను భక్తులు దర్శించుకున్నారు.