Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 August 2024, 5:22 pm Posted by : ramakrishna

ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

బతుకమ్మ, మోర్తాడ్ : ఆగస్టు09: మండలంలోని ధర్మోరా గ్రామంలో నాయక్ పోడ్ ఆదివాసీ సంఘ సభ్యుల ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అనంతరం కో మరం భీం చిత్ర పటానికి పూల మాలలు వేసి ఆదివాసీ నాయకపోడ్ జెండాను ఆవిష్కరణ చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆదివాసీ నాయకపోడ్ సంఘం ప్రధాన కార్యదర్శి జంబోతుల సాయన్న మాట్లాడుతూ… ఊహించని వేగంతో దూసుకెళ్తున్న ప్రపంచం ఒకవైపు ఉంటే సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ మారుమూల గ్రామాలలో మగ్గిపోతున్న ఆదివాసీల జీవితాలు ఇంకా దుర్భర పరిస్థితిలో ఉన్నారని అన్నారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీలకు తగిన గుర్తింపు ఇస్తూ సంక్షేమ ఫలాలను ప్రతి ఆదివాస బిడ్డకు అందించే విధంగా పాలకులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని వారు కోరారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో గిరిజనులు ఇప్పటికీ గుడిసె ల్లో ఉంటున్నారని వాపోయారు. గిరిజనులు ఐకమత్యంగా ఉంటూ వారి హక్కులు, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు సాధించుకుందామని అన్నారు. కార్యక్రమంలో నాయక్ పోడు సంఘం జిల్లా ఉద్యోగస్తుల సంఘం అధ్యక్షులు పుట్ట రాజేశ్వర్, ప్రభుత్వ ఉద్యోగులు, సొసైటీ డైరెక్టర్ పుట్ట గోపి, కుల సంఘాల పెద్దలు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.