వక్ఫ్ చట్టంపై బాన్సువాడలో మహిళల మహా సభ
బతుకమ్మ, బాన్సువాడ : కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వక్ఫ్ బిల్లును రద్దు చేసే వరకు దేశ వ్యాప్తంగా శాంతియుతంగా ఆందోళనలు చేస్తామని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు మహిళా కన్వీనర్ జలీసా సుల్తానా పేర్కొన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన కొత్త ఎండోమెంట్ చట్టంపై బాన్సువాడ డివిజన్ కేంద్రంని మీనా గార్డెన్ లో ముస్లిం మహిళల మహాసభ జరిగింది. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న సుల్తానా మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణ ప్రచారంలో భాగంగా జిల్లాలు, నగరాలలలో మహిళలు, పురుషులకు సంబంధించిన నిరసన ...