Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 September 2024, 3:59 pm Posted by : ramakrishna

మహిళా సాధికరతే కాంగ్రెస్ లక్ష్యం

మండల కాంగ్రెస్ ప్రసిడెంట్ బొదిరే స్వామి
భీమ్ గల్ , బతుకమ్మ : మహిళా సాధికారతే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పని చేస్తోందని, అందులో భాగంగా మహిళాలకు అభయహాస్తం కింద్ర మహలక్ష్మి పథకం ద్వార రూ.500లకే గ్యాస్ సిలెండర్ ను అందజేస్తోందని భీమ్ గల్ మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ బొదిరే స్వామి అన్నారు.సోమవారం మండల కేంద్రంలో మహలక్ష్మీ పథకం కింద ఎంపికైన లబ్దిదారులకు ఎంపిక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిలెండర్లు తీసుకొన్న నాలుగు రోజుల తర్వాత సబ్సిడీ డబ్బలు తమ తమ ఖాతాల్లో పడతాయని అన్నారు.సబ్బిడీ డబ్బులు సకాలంలో ఖాతాలో పడని సమక్షంలో 1967 నంబర్ కు కాల్ చేయాలని సూచించారు. మహిళలకు ఈవిధంగా లబ్దిచేకూర్చిన సీఎం రేవంత్ రెడ్డికి లబ్దిదారుల తరపున , మండల ప్రజల తరపున క్రుతజ్గతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు జెజె నర్సయ్య, పట్టణ నాయకులు మల్లెల లక్ష్మణ్, బాల్కొండ కాన్సిటెన్సీ కాంగ్రెస్ ప్రెసిడెండ్ నాగేంద్రబాబు,జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాద్యక్షులు వాక మహేష్, నల్లూరి శ్రీనివాస్, సుంకరి సురేష్, తోట నర్సయ్య, తోట ప్రతీప్, బొదిరే విశాల్ , దయ్య అనిల్, వంశీ,దినేష్ పాల్గొన్నారు.