నిజామాబాద్, బతుకమ్మ : నగరంలోని రెడ్ క్రాస్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా రెడ్ క్రాస్ చైర్మన్ బుస్సా ఆంజనేయులు మహిళా ఉద్యోగులను సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అన్ని రంగాలలో మహిళలు రాణిస్తున్నారన్నారు. కార్యక్రమంలో జిల్లా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్, కోశాధికారి కరిపే రవీందర్, జిల్లా కార్యదర్శి గోక అరుణ్ బాబు, నిజామాబాదు డివిజనల్ చైర్మన్ డా.శ్రీశైలం, బ్లడ్ బ్యాంకు మెడికల్ ఆఫీసర్ డా.రాజేష్, పీఆర్వో బొద్దుల రామకృష్ణ, రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు.