Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 April 2025, 3:01 pm Posted by : ramakrishna

తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు

= రుద్రూర్ లోని 9వ వార్డులో నెలరోజులుగా నిలిచిన నీటిసరఫరా

= పట్టించుకోని అధికారులు

రుద్రూర్, బతుకమ్మ :  తాగు నీటి సమస్యను పరిష్కరించాలని రుద్రూర్ మండల కేంద్రంలోని 9వ వార్డు కాలనీవాసులు ఆదివారం ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ.. నెల రోజుల నుంచి తాగు నీరు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. కాలనీలో తాగు నీటి సమస్యపై గ్రామపంచాయతీ కార్యాలయంలో పలుమార్లు విన్నవించినా కూడా అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని  వారు వాపోయారు. కాలనీలో ఉన్న వాటర్ ట్యాంక్ కు మెట్లు కూడా లేవని, వాటర్ ట్యాంక్ శిధిలావస్థకు చేరిందని కాలనీవాసులు ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి తాగు నీటి సమస్యను పరిష్కరించాలని  కాలనీవాసులు కోరుతున్నారు.