ఎమ్మెల్యే తోటలక్ష్మీకాంతరావుకు రాఖీలు కట్టిన మహిళలు

  జుక్కల్, బతుకమ్మ :   జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు రాఖీ పండుగను పురస్కరించుకుని మహిళలు రాఖీలు కట్టి శుభాకాంక్షలుతెలిపారు.  శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాజయోగినీ బ్రహ్మకుమారి స్వప్న, బీడీ కార్మికులు, మహిళా సంఘాల సభ్యులు, మహిళలు, చిన్నారులు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుకి రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారందరికీ ఆత్మీయంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్నాచెల్లెళ్ల అనుబంధం, ప్రేమ, ఆప్యాయతలు ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.