. . . తెలంగాణ జాగృతి రాష్ట్ర సీనియర్ నాయకులు లక్ష్మీ నారాయణ భరద్వాజ్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
మహిళలు రాజకీయంగా, విద్యా, వైద్య, పారిశ్రామిక లాంటి అన్ని రంగాల్లో ఎదగాలని తెలంగాణ జాగృతి రాష్ట్ర సీనియర్ నాయకులు లక్ష్మీనారాయణ భరద్వాజ్ అన్నారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నగరంలోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. అనంతరం తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కి, మహిళా సోదరీమణులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు పంచ రెడ్డి మురళి, రేఖ, శోభ, పుష్ప తదితరులు పాల్గొన్నారు.