మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
మోర్తాడ్, బతుకమ్మ : ప్రస్తుత సమాజంలో ప్రతి మహిళ అన్ని రంగాల్లో రాణించడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని కావున మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని మోర్తాడ్ ఎంపీడీవో తిరుమల దేవి అన్నారు. సోమవారం మోర్తాడ్ మండలంలోని దొన్ పాల్ గ్రామంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఏ పీ వో శకుంతల, పంచాయతీ కార్యదర్శి లక్ష్మీ దుర్గ, సర్పంచ్ బాజమ్మ, మహిళలు తదితరులు పాల్గొన్నారు.