నిజామాబాద్, బతుకమ్మ : సావిత్రిబాయి పూలే రాష్ట్రస్థాయి అవార్డులు పొందిన జిల్లాకు చెందిన మహిళలు బగ్గలి స్వప్న రజక, సురుకుట్ల ఝాన్సీ లను సోమవారం నగరంలోని బీసీ సంక్షేమ సంఘ కార్యాలయం లో నిజామాబాద్ బీసీ మహిళ సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలు శ్రీలత మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఏ రంగంలో అయినా రాణించే మహిళలకు తమ సంఘం పూర్తిగా మద్దతుగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో వాసంజయ, రేఖ, రుక్మిణి, అపర్ణ, నరాల సుధాకర్ కరిపే రవీందర్, దర్శనం దేవేందర్, అజయ్, చంద్రకాంత్, సురకుట్ల విజయ్, సాయి బసవ, సత్యనారాయణ, సురేందర్, బాలన్న, దేశాయి గంగాధర్, దామ నరసయ్య, హనుమాండ్లు, తదితరులు పాల్గొన్నారు.