చైన్ లాక్కొని తలపై కొట్టిన దొంగలు…?
బతుకమ్మ భిక్కనూరు: కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం కంచర్ల గ్రామంలో మహిళను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి చంపినట్టు గ్రామస్తులు బుధవారం తెలిపారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన సుగుణ(46) తన వ్యవసాయ భావి వద్ద వ్యవసాయ పని చేస్తున్నచోటికి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తన మెడలో నుంచి బంగారు పుస్తేల తాడును లాక్కొని దాడి చేయడంతో తలకు తీవ్ర గాయాలై మృతి చెందినట్లు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. పుస్తెలతాడు లాక్కునే సమయంలో అడ్డుకోవడంతో సుగుణపై దొంగలు దాడి చేసినట్లు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.