Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 August 2026, 7:25 pm Posted by : ramakrishna

రోడ్డు ప్రమాదం లో మహిళ మృతి

 

మెండోరా, బతుకమ్మ :

 

రోడ్డు ప్రమాదంలో దేవాయ్ అనే మహిళ మరణించినట్లు మెండోరా ఎస్సై సుహాసిని తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం సోమవారం మధ్యాహ్న సమయం లో ముప్కాల్ నుండి మెండోరా వస్తున్న ప్యాసింజర్ ఆటో డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా నడపటం వల్ల ఆటో బోల్తా పడింది. దాంతో ఆటోలో ప్రయాణిస్తున్న కోడిచర్ల గ్రామానికి చెందిన వేల్పూరు దేవాయ్ అనే మహిళ ఘటన స్థలం లో మృతి చెందినట్లు పేర్కొన్నారు. మిగతా వారికి గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ ముప్కాల్ గ్రామానికి చెందిన సాయికుమార్, మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు నిమిత్తం కేసు నమోదు చేసినట్లు మెండోరా ఎస్సై సుహాసిని తెలియజేశారు.