Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 May 2026, 7:42 pm Posted by : ramakrishna

పిండి గిర్నిలో షాక్ తగిలి మహిళ మృతి

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. పిండి గిర్నిని నీళ్లతో శుభ్రం చేస్తుండగా కరేంట్ షాక్ తగిలి మహిళ మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బండి రేణుక పిండి గిర్ని నడిపిస్తూ, భర్త యోగేష్ చికెట్ సెంటర్ నిర్వహిస్తూ మల్లారెడ్డిలో జీవనం సాగిస్తున్నారు. శనివారం యథావిదిగా గిర్ని ని తెరవడానికి వచ్చిన రేణుక అనంతరం గిర్నిని నీళ్లతో శుభ్రం చేస్తూ ఉండగా ఒక్క సారిగా షాక్ తగిలి వెనక్కి పడడంతో తలకు తీవ్ర గాయమైంది. దాంతో స్థానికులు వెంటనే కామారెడ్డి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. రేణుక మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.