నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాదు – జానకంపేటు మధ్య రైలు ఢీకొని గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లు రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి తెలిపారు. రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టడంతో మహిళ మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహాన్ని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించినట్లు తెలిపారు. మృతురాలిని ఎవరైనా గుర్తిస్తే నిజామాబాద్ రైల్వే పోలీసులకు 8712658591 ,9493451642 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.