చికిత్స పొందుతూ ఆత్మహత్యకు యత్నించిన మహిళ మృతి

బతుకమ్మ, మాచారెడ్డి:  అంగవైకల్యం తో జీవితం ఇంత కాలం వెల్లదీసింది‌ చాలు అని విరక్తి చెంది ఆత్మహత్యా యత్నం చేసిన గిరిజన మహిళ  చికిత్స పొందుతూ మూడు రోజుల కు మృతి చెందిన ఘటన మాచారెడ్డి మండలం ఎల్లంపేట గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బానోత్ పద్మ (43) ఈనెల 15న  రాత్రి 9 గంటల సమయంలో  తన అంగవైకల్యానికి తోడు తన కాలు విరిగినందున ఎప్పుడూ బాధపడుతూ జీవితం గడపడం అవసరమా అని మానసిక ఒత్తిడి కి గురవుతుండేది. ఇంట్లో ఎవరూ...