భిక్కనూరు, బతుకమ్మ :
రోకలితో కొట్టి ఓ మహిళ మెడలో గొలుసు చోరీ చేసిన ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం భిక్కనూరు గ్రామానికి చెందిన ఉప్పరి లక్ష్మి ఇంట్లో కూర్చొని ఉన్న ఆమెను రోకలితో కొట్టి ఆమె మెడలోని బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తులు లాక్కొని పారిపోయారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి బాధితురాలు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు. గాయపడిన వృద్ధురాలు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుంది.
