Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 July 2025, 11:39 am Posted by : ramakrishna

భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్యలు

జనగామ జిల్లాలో దారుణం
జనగామ, బతుకమ్మ :  ఇద్దరు భార్యలు కలిసి భర్తను గొడ్డలితో నరికి చంపిన ఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకుంది జనగామ జిల్లా లింగాల గణపురం మండలం పిట్టలోని గూడెం కు చెందిన కాల్వ కనకయ్య సోమవారం రాత్రి మద్యం మత్తులో తన ఇద్దరి భార్యలను చంపుతానంటూ గొడ్డలితో దాడికి యత్నించాడు. దీంతో ఇద్దరు భార్యలు కలిసి కనకయ్యను అదే గొడ్డలితో నరికి చంపడంతో అక్కడికక్కడే చనిపోయాడు. కాగా, కనకయ్య  మే 18న తన సొంత అక్కను హత్య చేసి అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు.