Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 December 2025, 11:59 am Posted by : ramakrishna

ప్రారంభమైన పార్లమెంట్ శీతకాల సమావేశాలు

డిల్లీ, బతుకమ్మ : పార్లమెంట్ శీతకాల సమావేశాలు సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి.  ఇటీవల మృతి చెందిన సభ్యులకు లోకసభ సంతాపం ప్రకటించింది. అలాగే వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత మహిళల క్రికెట్ జట్టుకు సభ్యులు అభినందనలు తెలియజేశారు. ఆతర్వాత ప్రశ్నోత్తరాల గంట చేపట్టగా.. విపక్ష సభ్యులు ఆందోళనకుక దిగారు. దీంతో సభను స్పీకర్ వాయిదా వేశారు.

కొత్త చైర్మన్ కు స్వాగతం పలికిన మోదీ

ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన సీపీ రాధాకృష్ణ న్ కు ప్రధాని మోదీ  స్వాగతం పలికారు. సమావేశాల్లో భాగంగా మోదీ మాట్లాడుతూ రాధాకృష్ణ న్ కు సామన్య రైతు కుటుంబం నుంచి వచ్చారని పేర్కొన్నారు.