Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 December 2024, 11:28 am Posted by : ramakrishna

మద్యం మత్తులో తండ్రిని కడతేర్చిన కోడుకు

. . . దిండుతో ఉపిరి అడకుండా చేసి హత్య

 రుద్రూర్, బతుకమ్మ:

తండ్రిని తనయుడు హత్య చేసిన ఘటన నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం అంబం(ఆర్ ) గ్రామంలోజరిగింది. రుద్రూర్  సిఐ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. రుద్రూర్ మండలంలోని అంబం(ఆర్) గ్రామానికి చెందిన  హైమద్(55) అనే వ్యక్తి ఆదివారం తన చిన్నకొడుకు మహబూబ్ అలియాస్ బబ్లు తో గోడవపడ్డారు. రాత్రి తన ఇంటిలో హైమద్ నిద్రిస్తున్న సమయంలో మద్యం మత్తులో మహబూబ్ దిండుతో ఉపిరి అడకుండా చేసి హత్య చేశాడని తెలిపారు. ఈ విషయం సొమవారం ఉదయం మృతుని పెద్ద కొడుకు జమీల్ పోలిసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగు చూసింది. బాధితుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు సిఐ వెల్లడించారు.  హైమద్ మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

who killed her father under the influence of alcohol