Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 February 2025, 4:16 pm Posted by : ramakrishna

జనగణన ఇంకెప్పుడు చేస్తారు..?

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

 

హైదరాబాద్, బతుకమ్మ : జనగణనపై కేంద్రాన్నిబీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎక్స్ వేదికగా నిలదీశారు. జనగణణ ఇంకెప్పుడు చేస్తారు.. జనగణన చేయకుండా కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తుదని మండిపడ్డారు. జనాభా లెక్కలు లేకుండా ప్రగతి ఎలా సాధ్యమవుతుదని ప్రశ్నించారు. జనాభా లెక్కల లేమితో వృద్ధికి ఆటంకం కలుగుతుందన్నారు. జనాభా లెక్కలు లేకుండా దేశ సామాజిక, ఆర్థిక పరిస్థతి ఎలా తెలుస్తందని ప్రశ్నించారు. ప్రగతి శీల విధానాలకు జనాభా లెక్కలు తప్పనిసరని తెలిపారు. జనగణనపై కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.