Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 October 2025, 5:32 pm Posted by : ramakrishna

జిఎంఆర్ అధికారుల పట్టింపేది..?

బతుకమ్మ, భిక్కనూరు: భిక్కనూరు మండల కేంద్రంలో ఎన్ హెచ్ 44 హైవే అంధకారంలో మగ్గుతుంది వివరాలు కి వెళితే  కామారెడ్డి నుండి హైదరాబాద్ వెళ్లే జాతీయ రహదారి పై భిక్కనూరు ప్రాంతంలో ఉన్న ఐమాక్స్ లైట్లు నెల రోజుల నుండి వెలగడం లేదు. దింతో వాహన దారులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి లైట్లు వెలగక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, జిఎంఆర్ అధికారులు ఏమాత్రం పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారని వాహనదారులు, ప్రజలు ఆరోపిస్తున్నారు.