అజారుద్దీన్ పై ఏం కేసులు ఉన్నాయో చెప్పాలి

హైదరాబాద్, బతుకమ్మ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. అజారుద్దీన్ పై ఏం కేసులు ఉన్నాయో సమాధానం చెప్పాలని కిషన్ రెడ్డికి ఆయన సవాల్ విసిరారు. భారత జట్టు కెప్టెన్ గా ఎన్నో విజయాలు సాధించారని, ఎంపీ గా ప్రజా సేవ చేశారని పేర్కొన్నారు. అజారుద్దీన్ కు మంత్రి పదవిపై బీజేపీ నేతలకు ఎందుకంత అక్కసు అని ప్రశ్నించారు. మంత్రి పదవిపై మూడు నెలల ముందే నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.