Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 January 2025, 4:58 pm Posted by : ramakrishna

సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు

  • మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే

బతుకమ్మ, జుక్కల్ : 13 నెలలు అవుతున్న రైతుబంధు సంక్షేమ పథకాలు అమలు చేయలేదని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మత్ సిందే ఆవేదన వ్యక్తం చేశారు.  జుక్కల్ మండలంలోని పెద్ద ఏడ్గీ, బిజ్జాల్ వాడి, కత్తల్ వాడి, మాదాపూర్, హంగర్గా, నాగుల్ గావ్, చిన్న ఎడ్గి గ్రామాల్లో బుధవారం ఆత్మీయ సమ్మేళ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సిందే మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఒక్క సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతు బీమా, రైతు భరోసా రైతు భరోసా, ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందని అన్నారు. బిజెపి నుండి చిన్న ఎడ్గి మాజీ సర్పంచ్ శివాజీ పటేల్, బస్వ పూర్ రవి పటేల్ టిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నీళ్లు పటేల్, బొల్లి గంగాధర్ వెంకట్ గౌడ్, పిట్టు పటేల్, శివాజీ పటేల్, మాజీ వైస్ మార్కెట్ కమిటీ చైర్మన్ శివాజీ, వెంకట్రావు, రమేష్, టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Welfare schemes are not implemented